JAI TELANGANA

JAI TELANGANA
"PORADITHE POYEDEMI LEDU BANISA SANKELU TAPPA ANDUKE PORADI TELANGANA SADIDAM ATMAHATYALA THO KADU" JAI TELANGANA! JAI JAI TELANGANA!!

T-News

Tuesday 13 September 2011

‘సకలం’ సక్సెస్ - మొదటి రోజు సమ్మెలో 80 వేల మంది ఉద్యోగులు


- ర్యాలీలు, ధర్నాలు రాస్తారోకోలు
- కలెక్టర్, జేసీల డ్రైవర్లు సమ్మెలోనే...
- అటెండర్ నుంచి గెజిటెడ్ వరకు అందరిది సమ్మె బాటే

510-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema:సకల జనుల సమ్మె మంగళవారం గ్రేటర్ హైదరాబాద్‌లో విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ జేఏసీ ఇచ్చిన పిలుపుతో గ్రేటర్ పరిధిలోని 63 శాఖలకు చెందిన 80వేల మంది ఉద్యోగులు మొదటి రోజు సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. టీఎన్‌జీవోల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎన్‌బీ.కృష్ణాయాదవ్, కార్యదర్శి హరిబాబు, సిటీ కేంద్ర కమిటీ అధ్యక్షురాలు రంజన, కార్యదర్శి వెంక రంగాడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, కార్యదర్శి రాంమోహన్ మంగళవారం ఉదయం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పర్యటిస్తూ సమ్మెను పరిశీలించారు. ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటామని ధైర్యం చెప్పారు. హైదరాబాద్, రంగాడ్డి జిల్లా కలెక్టర్ల కార్యాలయాలతో పాటు మండల రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది విధులు బహిష్కరించి పాలనను స్తంభింపజేశారు.

రంగాడ్డి జిల్లా కలెక్టర్, జేసీల వాహన డ్రైవర్లు సమ్మె బాటపట్టడంతో వారు ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేసుకున్నారు. రంగాడ్డి జిల్లా రిజివూస్టార్ కార్యాలయానికి తాళం వేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న గగన్ విహార్ కాంప్లెక్స్ వద్ద వాణిజ్య పన్నుల విభాగం, రెసిడెన్షియల్ పాఠశాలల కమీషనరేట్, శ్రీశైలం ప్రాజెక్ట్, ట్రెజరీ, ఇరిగేషన్, సాంఘిక సంక్షేమ, సహకార, వికలాంగుల సంక్షేమ, భూగర్భజల, సర్వశిక్ష అభియాన్ శాఖలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి ప్రధాన ద్వారాన్ని మూసివేసి కార్యాలయం ముందు బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. 170 జీవో కాదు.. 610జీవో అమలు చేయాలని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని, ఎస్మా, గిస్మా జాంతానై, తెలంగాణ దేనాహై వంటి నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.

ఇంజినీర్ల జేఏసీ కన్వీనర్ వెంక నాయకుడు బాల్‌నర్సయ్య, శ్రీధర్ దేశ్‌పాండేల ఆధ్వర్యంలో ఇంజినీర్లు సమ్మెలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కాలనీ వద్ద నీటి పారుదల శాఖ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, వాటర్‌వర్క్స్, జీహెచ్‌ఎంసీ, హౌసింగ్ కార్పోరేషన్, పబ్లిక్ హెల్త్ తదితర విభాగాల్లోని ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. సచివాలయం, పశువైద్యశాఖ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఆర్థిక గణాంకశాఖ, ఇంటర్‌విద్య, వ్యవసాయ విశ్వవిద్యాలయం, విద్యాశాఖ, సివిల్‌సప్లయ్, సబ్‌రిజివూస్టార్, లేబర్, సర్వే ల్యాండ్ రికార్డు, గృహనిర్మాణశాఖ, సిటీ సెంట్రల్ లైబ్రరీ తదితర శాఖలకు చెందిన ఉద్యోగులు ఎక్కడికక్కడ విధులను బహిష్కరించి ధర్నా చేశారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు మద్ధతుగా బస్‌భవన్ ముందు ఆర్టీసీ కార్మికులు, పర్యాటక శాఖ ముందు ఆ శాఖ ఉద్యోగులు, జలమండలి ముందు ఆ కార్యాలయాల ముందు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం సమన్వయ కర్త రఘు, మోహన్‌డ్డి, శివాజీల ఆధ్వర్యంలో వందలాది మంది ఉద్యోగులు విద్యుత్ సౌధా ముందు ధర్నా నిర్వహించారు.

తెలంగాణ ఉద్యోగులపై ప్రభుత్వ కఠినంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు. ఈ నెల 19 నుంచి తాము సహాయ నిరాకరణ చేపట్టనున్నామని తెలిపారు.

న్యాయవాదుల ఆందోళన
సకలజనుల సమ్మెలో భాగంగా ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా నగరంలోని హైకోర్టు, నాంపల్లి, రంగాడ్డి జిల్లా కోర్టులతో పాటు రాజేంవూదనగర్, హయత్‌నగర్, మియాపూర్ కోర్టులకు చెందిన న్యాయవాదులు విధులు బహిష్కరించారు. నాంపల్లి కోర్టు వద్ద జడ్జితో పాటు సీబీఐ అధికారులను అడ్డుకున్నారు. హైకోర్టు న్యాయవాదులు ర్యాలీ నిర్వహించిన అనంతరం మదినా సెంటర్‌లో అరగంటపాటు మానవహారం నిర్వహించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

విద్యాసంస్థల బంద్
తెలంగాణ సాధన కోసం జరుగుతున్న సకల జన సమ్మెకు మద్దతుగా విద్యార్థులు, టీఆర్‌ఎస్, బీజేపీ ప్రజాసంఘాలు ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించాయి. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శులు రాంమూర్తి, రామేష్‌ల ఆధ్వర్యంలో కళాశాలు బహిష్కరించి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. సైఫాబాద్ పీజీ కళాశాల, సిటీ కళాశాలల విద్యార్థులు కళాళాల ముందు ధర్నా కార్యక్షికమాన్ని చేపట్టారు. బీజీపీ గన్‌పార్క్ వద్ద ర్యాలీని నిర్వహించింది.

మౌలాలిలో జేఏసీ, కుద్బుల్లాపూర్‌లో టీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జి రాజు, ఈసీఐఎల్ ఇన్‌ఛార్జి బేతి సుభాస్‌డ్డి, రాజేంవూదనగర్ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఉప్పల్‌లో కళకారులు భారీ ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో దూందాం చేపట్టారు. సచివాలయాన్ని ముట్టడించడానికి టీ టీడీపీ నాయకులు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్‌నగర్‌లో తెలంగాణ వాదులు సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు.

Telangana employees began war


Work in various government offices in all the 10 Telangana districts was completely paralysed as employees boycotted duties as part of the Sakalajanula Samme which began on Tuesday.
Nearly 25,000 employees in Warangal and 30,000 in Karimnagar boycotted their duties in response to the political JAC's indefinite strike call. The employees staged a dharna in front of the collector office at Warangal and locked the office gates.
Protesting students obstructed Warangal superintendent of police Rajesh Kumar at the Arts College in Hanamkonda. They stopped his vehicle and shouted slogans. The students even refused to give way to his vehicle though the SP had to turn back to his office. They demanded the immediate suspension of DSP Venkata Narsaiah.
Doctors boycotted their duties at MGM Hospital. Doctors association president Nagendrababu said if the Centre does not grant Telangana, they would go ahead with an indefinite strike. "We will attend only emergency services," he threatened. All the employees belonging to revenue, education, I&PR, registration and 50 other department staff joined the mass indefinite strike.
Advocates stayed away from the courts as they took out rally from the Adalat junction to the collector office. Bar association members staged protests in front of revenue offices in Karimnagar district. Employees took out rallies at Karimnagar town, while students boycotted classes and formed a human chain at Kaman chowrasta in the town. TNGOs president Hameed monitored the mass strike in the district.
As part of the agitation lawyers in Nizamabad have decided to stay away from the court for eight days. A majority of the private schools were closed in the town. All the government offices in Adilabad district were closed during the day as all the employees stayed away from their duties.
As part of the strike, all sections of people stayed away from work and raised slogans in support of Telangana as they held sit-ins and other forms of protest. "The employees will not cooperate with the government. The state ministers from Telangana region should also participate in the strike," K Vithal, a leader of Telangana employees union said.
TRS leaders organised road blockades in Siddipet in Medak, Nalgonda and Khammam districts. Former minister Jupalli Krishna Rao and Nagarkurnool MP Manda Janganatham faced the wrath of Palamur students when they came to Mahbubnagar to render support to the JAC employees. The students and JAC leaders demanded Manda to submit his resignation first.

Friday 9 September 2011

Banswada Byelection Schedule Announced


The election commission has announced the schedule for Banswada assembly constituency. The notification for this election would be released on 19th September and the election would be held on October 13th.
Banswada seat fell vacant after senior Telugu Desam MLA Pocharam Srinivas Reddy resigned to the party and his MLA post in protest against TDP’s anti-Telangana stand.
Pocharam Srinivas Reddy later joined the Telangana Rashtra Samithi.
It would be interesting to see if TDP and Congress would dare to contest this by-election.
People of Telangana are vexed with the double standards of TDP and Congress and have already taught these two parties a fitting lesson in the 2010 Telangana by-elections. While TDP lost deposits in all the 12 seats it contested, Congress too was battered severely.
So, while Pocharam’s win is guaranteed, the only point of interest is how badly will TDP and Congress lose this election.

Thursday 8 September 2011

లక్ష్యం తెలంగాణ

- సకల జనుల సమ్మెకు మద్దతుగా నిరసనలు
- ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలకు ఉరి
- రాజీనామా చేయాలని తెలంగాణవాదుల డిమాండ్
- నేతల పోస్టర్లతో ర్యాలీలు, ధర్నాలు

Rayli-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
 ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు, తెలంగాణవాదులు చేపట్టనున్న సకల జనుల సమ్మెకు మద్దతుగా బుధవారం రాజకీయ, ఉద్యోగ, న్యాయవాద, విద్యార్థి జేఏసీ, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో తెలంగాణ వాదులు ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ప్రజావూపతినిధులు రాజీనామా చేసి ఉద్యమంలో కలిసి రావాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మకు ఉరి వేసి అనంతరం దహనం చేశారు. ఓ పక్క తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే మరోపక్క అధికారిక కార్యక్షికమాల్లో పాల్గొనడం నేతల నైజాన్ని తెలియజేస్తోందని ఆరోపించారు.

రంగాడ్డి జిల్లాలో చేపట్టిన నిరసన ర్యాలీలో తూర్పు జిల్లా జేఏసీ అధ్యక్షుడు చెల్మాడ్డి, నియోజకవర్గం ఉద్యోగ జేఏసీ కన్వీనర్ అశోక్‌కుమార్, ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, టీఆర్‌ఎస్, జేఏసీ, న్యాయవాదులు పాల్గొన్నారు. తాండూరులో సకల జనుల సమ్మెకు మద్దతుగా టీఆర్‌ఎస్, పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యం లో జైపాల్‌డ్డి, సబితాడ్డి, తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌డ్డి దిష్టిబొమ్మలకు చెప్పుల దండలు వేసి నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో జేఏసీ నాయకులు, అఖిల పక్ష నాయకు లు ఎమ్మెల్యే మహేశ్వర్‌డ్డి దిష్టిబొమ్మను ఉరితీశారు. నేరడిగొండలో రాజీనామా లు చేయని ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
adb-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
బోథ్‌లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్షికమాలు చేపట్టారు. మంచిర్యాలలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లోని పాతబస్టాం డ్ నుంచి రాజీవ్‌చౌరస్తా వర కు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాగరాజు, పట్టణ అధ్యక్షుడు నందుల ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల దిష్టిబొమ్మల శవయాత్ర నిర్వహించారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ను టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులకు టీఆర్‌ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. జిల్లా వ్యాప్తంగా సకల జనుల సమ్మెకు మద్దతుగా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. నల్లగొండలో రాజీనామా చేయని నేతలు గ్రామాలకు రావొద్దంటూ ఆందోళన చేపట్టారు. నల్లగొండలో జేఏసీ ఆధ్వర్యంలో రాజీనామా చేయని నేతలకు సంబంధించిన పోస్టర్లతో నిరసన వ్యక్తం చేశారు.

గడియారం సెంటర్‌లో పెద్ద పెట్టున నిరసనలు తెలిపి నేతలు గ్రామాలకు రావొద్దని, వస్తే అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. భువనగిరిలో కూడా రాజీనామాలు చేయని నేతలు గ్రామాలకు రావొద్దంటూ నిరసనలు తెలిపారు. మెదక్ జిల్లాలోని పలుచోట్ల తెలంగాణ వాదులు ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. పటాన్‌చెరులో సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. దుబ్బాకలో చెరుకు ముత్యండ్డి దిష్టిబొమ్మను ఉరేసి ఆందోళన చేశారు. కల్హేర్ మండలం బీబీపేట, అల్లాదుర్గం మండలం కెరూరులో ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. జిహీరాబాద్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నిజామాబాద్‌లో తెలంగాణవాదులు ప్రజావూపతినిధుల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలతో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించి దహనం చేసి నిరసన తెలిపారు.

తెలంగాణ వచ్చినా.. పదవులకు దూరమే-హరీశ్‌రావు



- 12లోగా రాజీనామాలు చేయకుంటే జనంలో తిరగలేరు
- ‘ప్రజాగర్జన’ను విజయవంతం చేయాలి
- టీఆర్‌ఎస్‌వీ సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు

 టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులపై సిద్ధిపేట ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత టి. హరీశ్‌రావు నిప్పులుచెరిగారు. తెలంగాణ కోసమే ఉద్యమిస్తున్న కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఆ పార్టీ నేతలకు లేదన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే పదవులకు రాజీనామా చేసి, ఆమోదింపజేసుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకూ పదవులకు దూరంగా ఉండడమే కాదు.. తెలంగాణ వచ్చినా పదవులకు దూరంగానే ఉంటామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు బాల్క సుమన్ అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమంలో పిల్లలతో పాటు వృద్ధులు కూడా పాల్గొంటున్నారని తెలిపారు. ‘తెలంగాణ వచ్చే వరకూ పదవులకు దూరంగా ఉంటామని ప్రకటనలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదు.’ అని విమర్శించారు. ‘తెలంగాణ కోసం కేసీఆర్ తన ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకూ కాపాలాకుక్కలా ఉంటానని ప్రకటించారు. అటువంటి ఉద్యమకారుడిని మీరు విమర్శిస్తారా..?’ అంటూ టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం రావాలన్న చిత్తశుద్ధి మీకు ఉంటే, వెంటనే పదవులకు రాజీనామా చేసి, ఆమోదించుకోవాలి.’ అని సవాల్ విసిరారు. తెలంగాణ కోసం ఉద్యమించినందుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఎన్నో కేసులు నమోదయ్యాయని, మీ మీద ఏమైనా కేసులున్నాయా..? అంటూ టీడీపీ ఎమ్మెల్యేలను ఆయన నిలదీశారు.

పదవులు పట్టుకొని వేలాడుతున్న మీరా మాకు నీతులు చెప్పేది అని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవులు లేకుంటే ఒడ్డున పడ్డ చేపలా గిలగిల కొంటుకుంటారని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం మంత్రిగా విధుల్లో పాల్గొంటున్నామని చెప్పిన పంచాయతీరాజ్ మంత్రి జానాడ్డి.. తెలంగాణ ఎవరు తెస్తారో చెప్పాలన్నారు. పంద్రాగస్టు నాడు జాతీయ జెండాలు ఎగిరేసేందుకు ఉరుకులాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదే ఊపుతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. హైదరాబాదీ బిడ్డనని చెప్పుకుంటున్నముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఈ నెల 12లోగా రాజీనామా చేయాలని, చేసిన రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. రాజీనామా చేయకుంటే ప్రజల్లో తిరగలేరని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనండి. మీకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటా.’ అని యువతకు హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 12న జరిగే ‘ప్రజాగర్జన’కు లక్షలాదిగా తెలంగాణ అభిమానులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. 

Wednesday 7 September 2011

వరంగల్‌లో మంత్రి పొన్నాల ఇంటిని ముట్టడించిన కేయూ విద్యార్థులు - రెచ్చిపోయిన పోలీసులు.. 18 మందిపై కేసులు

- జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చితకబాదారు
- కోర్టులో హాజరుపర్చాలన్న పాపానికి జిల్లా జాక్ చైర్మన్ పాపిరెడ్డి, టీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి, మరో నాయకుడు ఇండ్ల నాగేశ్వరరావు అరెస్టు 


Con-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaవరంగల్‌లో ఖాకీస్వామ్యం పడగవిప్పి బుసకొట్టింది. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని ముట్టడించి, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఫ్లెక్సీని చించివేశారనే నెపంతో కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి నేతలపైనా, విద్యార్థులపైనా పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. మంత్రి ఇంటిపై విద్యార్థులు దాడి చేశారనే కారణంగా కేయూ విద్యార్థుల్ని జిల్లాలోని దాదాపు అన్ని పోలీసు స్టేషన్లు తిప్పుతూ చితకబాదుతున్నారు. విద్యార్థుల్ని కోర్టులో ప్రవేశపెట్టాలని కోరేందుకు వెళుతోన్న జిల్లా రాజకీయ జేఏసీ ప్రొఫెసర్ పాపిడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఇండ్ల నాగేశ్వరరావును రఘునాథపల్లి పోలీసు స్టేషన్‌లో అరెస్టు చేశారు.

విద్యార్థుల్ని కోర్టులో ప్రవేశపెట్టకుండా పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో అత్యంత ఉద్రిక్తంగా, తెలంగాణ కోసం ఉద్యమించే వారిపై ఉక్కుపాదం మోపేందుకే సర్కారు కుట్రచేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సకల జనుల సమ్మెలో భాగంగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కేయూ జేఏసీ, జిల్లా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు మంగళవారం హన్మకొండ రాంనగర్‌లోని మంత్రి పొన్నాల ల ్మయ్య ఇంటిని ముట్టడించారు. విద్యార్థులు మంత్రి ఇంటి ఎదుట ై ఠాయించి చెప్పులు, బూట్లతో నిరసన తెలిపారు. తన మంత్రి పదవికి రాజీనామా చేసి సకల జనుల సమ్మెలో కలిసిరావాలని డిమాండ్ చేశారు.

అక్కడ బందోబస్తు నిర్తహిస్తున్న పోలీసుల కళ్లుగప్పిన కొందరు విద్యార్థులు మంత్రి ఇంట్లోకి దూసుకెళ్లి సోనియా ఫొటోఫ్లెక్సీని ధ్వంసం చేశారు. అలాగే ఇంటిపైకి రాళ్లు రువ్వి అద్దాలు పగులగొట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం మేరకు హన్మకొండ సీఐ వెంక సుబేదారి సీఐ రణధీర్, ఎసై్స రవికుమార్ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థులను ఈడ్చుకెళ్లి జీపులో పడేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో 18 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు 12 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. వీరిలో కేయూ జాక్ చైర్మన్ సాధు రాజేష్, విద్యార్ధి నాయకుడు దేవోజీ నాయక్, కొంగర కిషోర్, శ్రీనివాస్‌డ్డి, మనోజ్, ప్రశాంత్, బాలకృష్ణ, అనిల్, కృష్ణ, సమన్, రాంమోహన్‌డ్డి, యాకూబ్‌డ్డి ఉన్నారు.

ఠాణాలు చుట్టూ తిప్పుతూ..
Wangal-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడాన్ని టీఆర్‌ఎస్ నేతలతో పాటు జేఏసీ, న్యాయవాదులు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు పలువురు సుబేదారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారిని పరామర్శించారు. విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని, లేకుంటే తక్షణమే వారిని కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్ చేశారు. అరెస్ట్‌ను నిరసిస్తూ కేయూ విద్యార్థి నేతలు ఎస్డీఎల్‌సీఈ ఎదుట మంత్రి పొన్నాల దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా పోలీసులు విద్యార్థులను వైద్యచికిత్సల నిమిత్తం ఎంజీఎంకు తరలిస్తామని నచ్చజెప్పి ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఈ విషయం టీఆర్‌ఎస్, విద్యార్థి సంఘాల చెవిన పడటంతో వెంటనే వారిని అక్కడ నుంచి జఫర్‌గఢ్ ఠాణాకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులను చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. వారిని విడిపించేందుకు టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి, పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిడ్డి, టీఆర్‌ఎస్ యువజన నేత ఇండ్ల నాగేశ్వర్‌రావు జఫర్‌గఢ్‌కు వెళ్లగా అక్కడి నుంచి వారిని జనగామ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారనే సమాచారంతో వారిని అనుసరించగా ముగ్గురిని రఘునాథపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థుల్ని మాత్రం జనగామ తీసికెళుతున్నామని చెప్పి అక్కడి నుంచి మొదట లింగాల ఘనపురం అని ఆ తరువాత అక్కడా ఆందోళన జరుగుతోందని భావించి అక్కడి నుంచి దేవరుప్పులకు తరలించారు. అక్కడి నుంచి కొడకండ్ల పోలీసు స్టేషన్‌కు తీసికెళ్లారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఓయూ క్యాంపస్‌లో విద్యార్థులు రాత్రి ధర్నా జరిపారు. పొన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల అరెస్టుకు నిరసనగా గురువారం పోలీస్ స్టేన్ల ముట్టడికి పిలుపునిచ్చారు.

ప్రజాసంఘాల నిరసన
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన విద్యార్థుల్ని పోలీసులు..నక్సలైట్లను పోలీసు స్టేషన్లు తిప్పినట్టు తిప్పుతూ భయాందోళనకు గురిచేస్తోన్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్యను రాజీనామా చేయాలని ముట్టడించే క్రమంలో జరిగిన చిన్నసంఘటనను ఆసరాగా చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం, పొన్నాల లక్ష్మయ్య కావాలని విద్యార్థుల్ని చితకబాదుతున్నారన్నారు.

విద్యార్థులకు రక్షణగా వెళుతోన్న తమనూ రఘునాథపల్లి పోలీసు స్టేషన్‌లో అరెస్టు చేయడాన్ని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌డ్డి, టీఆర్‌ఎస్ యూత్‌నేత ఇండ్ల నాగేశ్వరరావును అరెస్టు చేశారు. ఈ అక్రమంగా అరెస్టు చేసినవారిని తక్షణమే కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ ప్రజావూఫంట్ జిల్లా కన్వీనర్ రమాదేవీ, ఎపీసీఎల్‌సీ నేత అంబటి శ్రీనివాస్, రాష్ట్రబార్ కౌన్సిల్ మెంబర్ ఎం. సహోదరడ్డి, జిల్లా బార్ అధ్యక్షుడు రావు అమరేందర్‌డ్డి, టఫ్ బాధ్యులు ఎండి రియాజ్ సహా పలువురు డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థులు క్షేమంగానే ఉన్నారు: జిల్లా ఎస్పీ
తెలంగాణ ఉద్యమాన్ని ఆసరాచేసుకొని కొంతమంది క్రిమినల్ మెంటాలిటీతో విధ్వంసం చేయాలని చూస్తున్నారని, అటువంటి వారినే తాము అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ రాజేశ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం వారంతా తమ కస్టడీలో క్షేమంగా ఉన్నారని వారిని కోర్టులో ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. అయితే ఈ కేసులో మంత్రి పొన్నాల లక్ష్మయ్యకానీ, ఆయన అనుచరులు కానీ ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, తామే సూమోటాగా కేసు నమోదు చేశామనీ ఆయన స్పష్టం చేశారు.

అరెస్ట్ చేయడం తగదు: మల్లేపల్లి లక్ష్మయ్య
మంత్రి పొన్నాల ఇంటివద్ద ఆందోళన చేసినందుకు విద్యార్థులను అరెస్ట్ చేయడం తగదని రాజకీయ జేఏసీ కో- చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. తెలంగాణలో పుట్టి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులకు రాజీనామా చేయాలని కోరితే అరెస్ట్ చేస్తారా? అని మండిపడ్డారు.

విమలక్క ఖండన
మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి రావల్సిందిగా కేయూ విద్యార్థులు మంత్రి పొన్నాల ఇంటివద్ద ఆందోళన చేయడం ప్రజాస్వామ్యయుతమేనని, వారిని అరెస్టు చేసి, దమనకాండ సాగించడం ప్రజాస్వామ్యం కాదని తెలంగాణ ఐక్య వేదిక నాయకురాలు విమలక్క అన్నారు. కేయూ విద్యార్థులను పోలీసులు ఠాణాలు తిప్పుతూ గొడ్లను కొట్టినట్టు కొట్టడాన్ని ఖండించారు.

Tuesday 6 September 2011

తెలంగాణ రావడం మంత్రులకు ఇష్టం లేదు- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ

narayana-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema

 తెలంగాణ కోసం, జగన్ కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తీరు గుర్రానికి, గాడిదకు ఉన్నంత తేడా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా గోదావరిఖని, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం రాజకీయ ప్రక్రియలో భాగమని, జగన్ కోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం అవినీతి, కుంభకోణాలను ప్రోత్సహించడమేనని అభివూపాయపడ్డారు.

రెండింటినీ ఒకే విధంగా పోల్చడం సరికాదన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన అడ్డంకి అని ధ్వజమెత్తారు. మంత్రులకు తెలంగాణ రావడం ఇష్టం లేదని, పైకి మాత్రం కావాలని అంటున్నారని ఆరోపించారు. దొంగచాటుగా విధులు నిర్వర్తించడమే దీనికి నిదర్శమన్నారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రాన్నిఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని, పచ్చి అవకాశవాద వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. ఏదో ఒక సాకు చెప్పి తెలంగాణ విషయాన్ని వాయిదా వేస్తున్నారని, అవినీతి, కుంభకోణాలు మాత్రం ఏ అడ్డూలేకుండా చేస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. అణుఒప్పందంపై కేంద్రం మైనార్టీలో ఉన్నప్పటికీ తీర్మానం నెగ్గించుకుందని, తెలంగాణను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర సాధనలో సీపీఐ ముందువరుసలో ఉందని, భవిష్యత్‌లోనూ ఉంటుందని చెప్పారు.

సకల జనుల సమ్మెకు మద్దతుగా ఇప్పటికే కార్యక్షికమాలు చేపట్టామని, సింగరేణిలో సమ్మెను ఏ విధంగా ముందుకు తీసుకు విషయంలో చర్చిస్తున్నట్లు చెప్పారు. జేఏసీతో, గద్దర్, కోదండరాంలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సకల జనుల సమ్మెకు మద్దతు ఉంటుందని ప్రకటించారు.

ఆస్తులు ప్రకటించాలని బాబును ఎవరడిగారు?
రాజకీయ, కార్పొరేట్ అవినీతి బయటకు రాకుండా బూర్జువా పార్టీలు అడ్డుపడుతున్నాయని, ప్రజల దృష్టిని మరల్చడానికే నాయకులు ఆస్తులను ప్రకటిస్తున్నారని విమర్శించారు. రాజకీయాల అక్రమంగా సంపాదించిన ₹73లక్షల కోట్లను స్విస్‌బ్యాంకుల్లో దాచుకున్నారని ఆరోపించారు. గంగిగోవుగా పేరొందిన ప్రధాని మన్మోహన్‌సింగ్ హాయంలోనే 2జీ స్ప్రెక్ట్రమ్, అదర్శ్, కామన్ కుంభకోణాల్లో ₹3లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. అవినీతిపై పోరాటం పేరుతో ప్రజల్లోకి వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆస్తులను ప్రకటించాలని, ఎవరు అడిగారని ప్రశ్నించారు. అవినీతి ఆంశాన్ని పక్కదోవ పట్టించడానికే ఆస్తులు ప్రకటించారని ఎద్దేవా చేశారు. ప్రజావూపతినిధులు ప్రకటించిన ఆస్తులకు 60 రెట్లు అధికంగా చేసుకొని చదువుకోవాలన్నారు.

ఎప్పుడో 1983లో ₹90వేలతో హైదరాబాద్, తిరుపతిలలో తాను కోనుగోలు చేసిన రెండు స్థలాలు ప్రస్తుతం ₹65లక్షలకు చేరుకున్నాయని చెప్పారు. చంద్రబాబు తన ఆస్తుల వివరాల్లో ప్రస్తుత విలువ కాకుండా ఎప్పుడో ఉన్న విలువ ₹ 50 కోట్లుగా చూపించారని, వాస్తవానికి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఎంత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. 90వేల పెట్టుబడి పెడితే తన విలువ ప్రస్తుతం 65 రెట్లు పెరిగిందని, ఈ లెక్కన బాబు ₹50కోట్లు పెట్టుబడి పెడితే 50ట్లు పెరిగి ప్రస్తుతం అతని ఆస్తులు ₹2500 కోట్ల వరకు ఉంటాయని వివరించారు. నాలుగేళ్ల కిందట ₹2కోట్ల ఆదాయపు పన్ను చెల్లించిన జగన్ ఇప్పుడు ₹400కోట్లు ఎలా చెల్లిస్తున్నాడు? అక్రమంగా సంపాదించడానేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏకం కావాలని ప్రశ్నించారు.

అవినీతికి పాల్పడిన వారికి నార్కోఅనాలిసిస్ పరీక్ష చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని, పరీక్ష తాను కూడా సిద్ధమని ప్రకటించారు. సమావేశంలో సీపీఐ శాసన సభా పక్ష నేత గుండా మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటడ్డి, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య,సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి,బద్రి సత్యనారాయణ, కలవేన శంకర్, మల్లాడ్డి, వీరభవూదయ్య, ఖలేందర్‌ఖాన్ పాల్గొన్నారు.

BJP wants September 17 to be celebrated as Telangana Liberation Day


The Andhra Pradesh unit of BJP today called upon people of Telangana and political parties there to celebrate September 17 as 'Telangana Liberation Day' to commemorate the region's freedom from erstwhile Nizam rule.
"Inspite of repeated requests by the party to celebrate the day as 'Telangana Liberation Day', TDP and Congress governments have neglected the people's demand and it was an affront to four-and-a-half crore people of the region," senior BJP leader Bandaru Dattatreya told reporters here.
The region got freedom from the clutches of erstwhile Nizam rule in 1948, a year after the country's independence in 1947, he said.
Reiterating party’s demand Dattatreya urged Chief Minister Kiran Kumar Reddy to declare officially September 17 as Telangana Liberation Day and organise official programmes.
After freedom for the region, some of the districts were merged in Karnataka and Maharashtra and these states celebrate the day officially, Dattatreya said.
"Why the Andhra Pradesh government is hesitating to celebrate the day officially," he asked.
Urging political parties in Telangana region to celebrate the day at a large scale, Dattatreya said all educational institutions and employees should hoist tricolour in their offices and public places to show their strength.
Telangana, Marathwada and some districts in Karnataka were under the control of Nizam rulers even after the country gained independence in 1947. In September 17, 1948 the province was liberated and integrated with the Indian union.
T Rajeshwar Rao, Chairman of Telangana struggle committee of the state party was also present on the occasion.

Sunday 4 September 2011

ముఖం మీద ఉమ్మేసినా దిగి వచ్చేలా లేరు: కెసిఆర్

04-kcr18-300
ముఖం మీద ఉమ్మేసినా తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు తెలంగాణ కోసం రాజీనామాలు చేసేలా కనిపించడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. తెలంగాణ వాళ్లను పాఠశాలలు పెట్టుకొని కూడా బతకనివ్వరా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడ్డాక విద్యాసంస్థలకు వీలైనన్ని ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం సాధించి తీరాలన్నారు. అనుకోని పరిస్థితులు ఏర్పడి తెలంగాణ రాకుంటే తెలంగాణ ప్రజల బతుకులు దారుణంగా ఉంటుందన్నారు.
మనల్ని ఆంధ్రా పెట్టుబడిదారులు ఏ రంగంలోనూ బతకనివ్వరన్నారు. తెలంగాణ వస్తేనే దోపిడీ ఆగిపోతుందన్నారు. సందర్భం ఏదైనా అందరం ఒకటిగా కలిసి ఉండాలని సూచించారు. రాజకీయంగా కూడా అందరూ ఏకం కావాలన్నారు. సకల జనుల సమ్మెకు అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. సకల జనుల సమ్మెలో విద్యాసంస్థలు కూడా పాల్గొనాలని సూచించారు

ఇక దిగ్బంధమే -యావత్ దేశం ఆశ్చర్యపోవాలి



trs-bavan-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema

KCR-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, సెప్టెంబర్ 3 :తెలంగాణ రాజకీయ జేఏసీలో ప్రధాన భాగస్వామి అయిన పార్టీగా టీఆర్‌ఎస్ నుంచి ప్రజలు ఉద్యమ కార్యాచరణను ఆశిస్తారు కాబట్టి అదే స్థాయిలో వారిలో సమరోత్సాహాన్ని నింపేందుకు సకల జనుల సమ్మెను, కరీంనగర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్‌లో అంతర్గతంగా జరిగిన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. సమ్మెను, కరీంనగర్ సభను సక్సెస్ చేసే బాధ్యతను పార్టీ కేడర్ భుజస్కంధాలపై వేసుకోవాలని ఆయన సూచించారు. వివిధ రూపాల్లో ఉద్యమ కార్యాచరణ అమలులో తలమునకలై ఉన్నందువల్లే పార్టీ కార్యకలాపాలపై దృష్టిని సారించలేక పోయానని చెప్పిన కేసీఆర్.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి త్వరలోనే వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ రహదారుల దిగ్బంధనాన్ని కనీవినీ ఎరుగని రీతిలో గ్రాండ్ సక్సెస్ చేయాలని, దేశం యావత్తు ఆశ్చర్య పోయే స్థాయిలో ఈ కార్యక్షికమాన్ని నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.


తెలంగాణకు వచ్చే సీమాంవూధవూపాంతాల దారులన్నింటినీ మూసివేయాలని, చీమ కూడా చిటుక్కుమనొద్దన్న స్థాయిలో దిగ్బంధం ఉండాలని ఆయన సూచించారు. రాష్ర్ట పాలన మొత్తం స్తంభించిపోవాలని, అవసరమైతే జైళ్లకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. 17న తెలంగాణ విమోచన దినోత్సవం ఉన్నందున జాతీయ రహదారుల దిగ్బంధనాన్ని 18వ తేదీకి మార్చాలన్న విషయంపై జేఏసీని కోరనున్నట్లు చెప్పారు. దిగ్బంధం ఎప్పుడు జరిగినా పార్టీ కేడర్ ఈ కార్యక్షికమాన్ని సొంతం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్‌ఎస్‌కు 110 ఎమ్మెల్యే, 16 ఎంపీ స్థానాలు దక్కడం ఖాయమని కేసీఆర్ అన్నారు.
http://www.porutelangana.com/topstories.php?id=261

Saturday 3 September 2011

Government staff strike in Telangana from Sept 13


Government employees in the Telangana region of Andhra Pradesh will go on indefinite strike from Sep 13 as part of "sakala janula samme" or mass strike planned by all sections of the society seeking statehood.

The steering committee of Telangana employees' joint action committee (JAC) on Saturday decided to serve the strike notice on the government Monday.

The employees also decided to stage lunch-hour protests from Monday to mobilise support for the strike, which was earlier deferred twice. 

The strike was originally planned Aug 17 to demand that the central government initiate the process for carving out a Telangana state out of Andhra Pradesh. The JAC deferred the strike to Sep 6 following appeals from Muslim groups to postpone it in view of the holy month of Ramzan.

The JAC once again postponed the strike in view of Ganesh festivities, which began Sep 1 and will continue till Sep 11.

The JAC, comprising political groups, said the strike would signal resumption of the movement on a bigger scale. It hoped teachers and employees of public sector undertakings would also join the strike.

JAC convenor M. Kodandaram said the strike would bring the administration to halt, affect services like electricity supply and transport while schools and colleges would also shut down.

The JAC plans to organise a huge public meeting "Jana Garjana" at Karimnagar Sep 12. All cinema halls in the region would be shut Sep 14 and 15. There would be a blockade of national highways Sep 17 and rail blockade Sep 22. Telangana activists will lay siege to the offices of the district collectors Sep 25.

As part of final phase of its agitation, the JAC plans to lay siege to Hyderabad in October. 

Friday 2 September 2011

నాదెండ్ల మీరు స్పీకరా.. లేక సీమాంధ్ర బ్రోకరా??




మిస్టర్‌ నాదెండ్ల మనోహర్‌రావు.. మీరు స్పీకరా లేక సీమాంధ్ర బ్రోకరా.. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నది నక్సలైట్లా.. సిగ్గులేదా చెప్పడానికి.. నీది నోరా మోరా? నీకున్నది నాలుకా.. తాటిమట్టా... సిగ్గుషరం లేకుండా అబద్దాలాడుతవా.. అని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు.
తెలంగాణ ఉద్యమాన్ని నక్సల్స్ వెనకుండి నడిపిస్తున్నారట. పోరాటం ఇలాగే కొనసాగితే 1969లాగే ఇప్పడు కూడా నక్సలైట్లు పుట్టుకొస్తారట. స్పీకర్ నాదెండ్ల మనోహర్ రావు యూఎస్‌ కాన్సులేట్‌ అధికారులకు చెప్పిన మాటలివి..నాదెండ్ల బ్రోకర్‌ మాటలను వికీలీక్స్ కేబుల్స్ బైటపెట్టింది. స్పీకర్ చెప్పిన విషయాలన్నీ కాన్సులేట్ అధికారులు యూఎస్కు నివేదిక రూపంలో పంపారని వికీలీక్స్ చెప్పింది. తెలంగాణ ఉద్యమంపై యూఎస్‌ కౌన్సిల్‌ జనరల్ కార్నెలిస్‌ ఎం క్యూర్‌తో చెప్పిన మాటల్ని వికీలీక్స్‌ బయటపెట్టింది.
 గత ఉద్యమాల్లో పాల్గొన్న నాయకులు ఆ తరువాత నక్సలైట్ లీడర్లుగా ఎదిగారని... వారంతా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతిచ్చి ప్రజల సానుభూతి పొందారని నాదెండ్ల కాన్సులేట్‌ అధికారితో అన్నట్లు వికిలీక్స్‌ బయటపెట్టింది.
ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ వర్గానికి చెందిన విద్యార్థి నాయకులు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నరని.. వాళ్లంతా 30ఏళ్లు పైబడిన వారేనని మనోహర్‌ చెప్పినట్టు వికీలీక్స్‌ పేర్కొంది. ఒక విద్యా సంవత్సరం పాడైనా పర్వాలేదని వాళ్లు విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారని స్పీకర్‌ అన్నట్టు వికీలీక్స్‌ వెల్లడించింది. ఉద్యమం ముసుగులో మావోయిస్టు రిక్రూట్‌మెంట్‌ క్యాంపెయిన్‌ విజయవంతంగా జరుపుతున్నదని నాదెండ్ల యూఎస్‌ కాన్సులేట్‌తో చెప్పినట్టు వికీలీక్స్‌ కేబుల్స్‌ బయటపెట్టింది.
స్పీకర్‌ మనోహర్‌ రావు మాత్రం తాను విధినిర్వహణలో భాగంగా కాన్సులేట్‌ అధికారులతో మాట్లాడిన్నని అన్నరు. కానీ తెలంగాణ గురించి మాట్లాడినట్టు గుర్తుకులేదట. స్పీకర్‌ తీరుపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నరు. మాదిగల మీద అడ్డదిడ్డంగా మాట్లాడిన మనోహర్‌రావుపై ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ కేసుపెట్టి అరెస్టు్‌ చేయాలని దళిత బహుజన నాయకులు డిమాండ్‌ చేస్తున్నరు.
by
(తెలంగాణ శ్రీనివాస్‌)
http://www.porutelangana.com/topstories.php?id=260

AP SPEAKER A CUNNING .........


Speaker N Manohar’s alleged conversation with the then US consul general Cornelis M Keur on Telangana agitation is kicking up a political storm.
Various political parties have stepped up heat on the Speaker who made the statement during his tenure as deputy speaker of the Assembly and wanted an explanation from him.
Students organisations in Telangana have demanded his removal from the Speaker’s post and called for burning the effigies of the Speaker in Telangana region on Friday.
The Telangana protagonists reacted sharply to the cable which was released by whistleblower website Wikileaks on August 26 following its publication in these columns.
The cable sent by Cornelis Keur quoted that the then deputy speaker of the AP Legislative Assembly N Manohar telling CongenOff (consul general officials) that the police were convinced that, like in 1969, the current unrest over Telangana statehood will result in a recruitment campaign by Naxalite forces in the region.
Reacting sharply, TJAC chairman M Kodandaram said people from coastal Andhra who were in responsible Constitutional positions were not being impartial to Telangana people.
“They are trying to project Telangana movement in a bad light and suppress it.
This has become evident following the cables released by Wikileaks.
The Speaker should not continue in the post,” he said.
Telangana Students JAC convener Pidamarthi Ravi demanded the removal of Manohar from the post for making derogatory remarks against students and gave a call for burning the effigies of the Speaker on Friday.
Suspended TDP MLA Nagam Janardhan Reddy demanded that Manohar should give an explanation to Telangana people and termed the statements as unfortunate.
“The statement of the Speaker has hurt the sentiments of students and he should give an explanation immediately, else he has no right to continue in the post,” he said.
CPM leader Veeraiah said that the US watch on internal issues of the state is a threat to our nation and it is unfortunate that our leaders have discussed internal issues with outsiders.
However, the Telangana Congress leaders tried to downplay the incident saying that any person who is in a responsible post would not make such comments, particularly a soft spoken person like Manohar.
Congress MLA Gandra Venkataramana Reddy stated that there is no way that the Speaker could have made the statement as it would send wrong signals among foreigners.
“However, the Speaker should come out clean and give an explanation,” he said.
Another Congress MLC Yadava Reddy reflected similar views, while PCC president Botcha Satyanarayana refused to comment saying that he had not seen the news report.